ధర్మారం/జగిత్యాల అర్బన్/జగిత్యాల రూరల్/గొల్లపల్లి, నవంబర్ 30 : సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించడంతో రాష్ట్రంలో 1.20 కోట్ల ఎకరాలకు పుష్కలంగా నీరంది పంటలు పండుతున్నాయని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నంది రిజర్వాయర్ నుంచి రూ.12.40 కోట్ల వ్యయంతో ఎడమ వైపు లింక్ కాల్వ నిర్మాణానికి పూజ చేశారు. అనంతరం జగిత్యాల, గొల్లపల్లి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.