నందిగామ, మే 23 : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీ రామచంద్రమిషన్ అధ్యక్షుడు, హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ)కు అరుదైన అవార్డు దక్కింది. ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డును గురువారం ఆయన లండన్లో అందుకున్నట్టు రామచంద్రమిషన్ పీఆర్వో శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్య, వైద్యం, పర్యావరణ వంటి రంగాల్లో దాజీ చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందించారని, దీంతోపాటు కామన్వెల్త్ సెక్రటేరియట్తో ప్రత్యేక అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొన్నారు.