హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులుగా చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతున్నది. గురు, శుక్రవారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అంగీకారం ప్రకారం, పోస్టింగులు ఇవ్వడం పూర్తయింది. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు నేపథ్యంలో అధ్యాపకుల భర్తీ కోసం వైద్యారోగ్య శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి విలీ నం చేశారు. కొత్త మెడికల్ కాలేజీల్లో క్లినికల్ విభాగాలకు చెందిన 366 పోస్టులు, నాన్ క్లినికల్ 120 పోస్టులను గుర్తించారు. రెండురకాలు కలిపి 179 మంది పోస్టింగు లు అందుకున్నారు. మిగతావారు వివిధ కారణాలతో ముందుకు రాలేదు. అలాంటి వారందరిని కూడా సేవల్లోకి రప్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంతో విలువైన ఇన్సర్వీస్ పీజీ సీటును ఇచ్చి, తిరిగి వారినుంచి సేవలు తీసుకోకపోతే ఎలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇన్సర్వీస్ కోటాలో పీజీ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులుగా కొనసాగుతున్నారు. అక్కడ వారిసామర్థ్యం పూర్తిస్థాయిలో స ద్వినియోగం కావడం లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.