హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు ప్రత్యేక ప్రయోజనం కలిగేలా 232 సీట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రగతిభవన్లో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ప్రత్యేకంగా శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ టీచింగ్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులకు టీపీహెచ్డీఏ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కత్తి జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు.