కొత్తగూడెం అర్బన్, మార్చి 20 : అభివృద్ధిపరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరుగులు తీస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నా రు. రియల్ఎస్టేట్ రంగం సైతం ఊపందుకున్నదని చెప్పారు. జిల్లాకేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ తరహాలో ఈవెంట్ నిర్వహించడం నమస్తే తెలంగాణకే సాధ్యమైందని కొనియాడారు. అపార్టుమెంట్ సంస్కృతి సైతం అంతటా ప్రారంభమైందన్నారు. నూతన జిల్లాలో ఇటువంటి నిర్మాణాలు మరిన్ని రావాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పట్టణాభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ ప్రాపర్టీ షోకు.. డివైన్ హోమ్స్ శ్రీనివాస హైట్స్, శ్రీబాలాజీ ఎస్టేట్ మెయిన్ స్పాన్సర్స్గా, శ్రీజయవిలాసిని అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, సింగరేణి జీఎం నరసింహారావు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జీఎం ఎన్ సురేందర్రావు, డీజీఎం రాజిరెడ్డి, బీఎం రేనా రమేశ్, బ్యూరో ఇంచార్జి ఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.