హైదరాబాద్: ఓటర్ల జాబితా (Voter list) సవరణకు శని, ఆదివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ, రేపు పోలింగ్ బూత్ల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉంటారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించామని, అందరూ ఉపయోగించుకోవాలని తెలిపింది.
2022, జవనరి నాటికి 18 ఏండ్లు నిండినవారు ఓటర్లుగా తమ పేరును నమోదుచేసుకోవచ్చని పేర్కొన్నది. ఆన్లైన్లో కూడా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకున్నవారు www.ceotelangana.nic.in, www.nvsp.in వెబ్సైట్లు చూడవచ్చని తెలిపారు. ప్రతి ఏడాది ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఏటా జనవరి 18ని ఓటర్ల దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
new voters