హైదరాబాద్, మార్చి6 (నమస్తే తెలంగాణ): రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్11 వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది.
రంజాన్ ఏర్పాట్ల పరిశీలన
హజ్హౌజ్ మసీద్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ ఏర్పాట్లను బుధవారం వక్ఫ్బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ పరిశీలించారు. ప్రార్థనలకు, ఇఫ్తార్ విందుకు ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.