హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా మినహా పాత ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ (టీఎస్ఎఫ్పీజడ్)లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వీటి ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఒక్కొక్కదాన్ని 250 ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులకు సూచించింది. రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఇందులో ఏర్పాటు చేసేలా సత్వరం చర్యలు తీసుకోవాలని కేబినేట్ ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.