హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ధరణిలో పెండింగ్లో ఉన్న 2.5 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
నాలుగు రోజుల్లో సుమారు 30 వేల దరఖాస్తులను అధికారులు డిస్పోజ్ (తిరస్కరణ) చేసినట్టు సమాచారం. మండల స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు.