కామారెడ్డి : బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వసతి గృహంలోని సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం బాగుంటుందా అని విద్యార్థినులను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. అన్ని బాగున్నాయని విద్యార్థినులు తెలుపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే నాణ్యతా ప్రమాణాలు కొనసాగించాలని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, తదితరులు ఉన్నారు.