హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. ఈ మేరకు స్పీకర్ కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ టెస్టు చేయించగా, పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఎలాంటి సమస్యలు లేనప్పటికీ, డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి చేరారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారితో పాటు సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సరిగ్గా రెండు నెలల క్రితం స్పీకర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.