హైదరాబాద్: శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. సాధారణ పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా టెస్టు చేయించుకున్నాని, అందులో పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు దవాఖానలో చేరానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.