స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడే మొక్క నాటారు. రాష్ట్రంలో 12,751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటైనట్టు స్పీకర్ తెలిపారు. దీనికితోడు ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపులో భాగంగా రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని తెలిపారు.
– బాన్సువాడ రూరల్