హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఎల్సీ(లైన్ క్లియరెన్స్)లకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఎస్పీడీసీఎల్ సీఎండీకి విజ్ఞాపన పత్రాలు సమర్పించాయి.
ఎల్సీ (లైన్ క్లియరెన్స్) తీసుకోవడం నిరంతర ప్రక్రియ అని, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఎల్సీల విషయంలో తీవ్రంగా చర్యలు తీసుకుందని, కొత్త వినియోగదారులకు విద్యుత్తు సరఫరా కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని, వినియోగదారులకు, పనులు పూర్తిచేసిన తమకు నష్టం వాటిల్లుతున్నదని, వీటిని పరిశీలించాలని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నాయి.