నీలగిరి, ఏప్రిల్ 9: నకిలీ కరెన్సీ నోట్ల తో మోసాలకు పాల్పడుతున్న విదేశీ నిందితుడిని అరెస్ట్ చేసి మూడు కట్టల బ్లాక్ కలర్, రూ.500 నోట్ల సైజు కాగితాలు, రూ.2 వేల నగదుతోపాటు సెల్ఫోన్ స్వా ధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సీ శరత్చంద్ర పవార్ తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాలి దేశానికి చెందిన సాల్మన్ ఉమ్ దా లియా, గోటియాసౌన్గాలో రెండు సంవత్సరాల క్రితం భారత్కు వచ్చి కొంతమందితో కలిసి నకిలీ కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఈనెల 6న తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం దాబా వద్ద ఎంగూరి జానయ్య నుంచి లక్ష రుపాయల అసలు కరెన్సీ తీసుకొని రూ.5 లక్షల నోట్ల కట్టగా నమ్మబలికి, పైభాగంలో నాలుగు ఒరిజనల్ 500 నోట్లు చూపించి మిగతా భా గంలో నల్లటి కాగితాలు ఇచ్చారు. మోసపోయిన గ్రహించిన బాధితుడు.. ఆతర్వాత పక్కాగా ప్లాన్ చేసి నిందితుడిని పోలీసులకు పట్టించారు.