హైదరాబాద్ : రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. సికింద్రాబాద్ – తిరుపతి (రైలు నం.07469) ఈ నెల 3న రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుకోనున్నది. ఈ నెల 4న తిరుపతి – సికింద్రాబాద్ (రైలు నం. 07470) రాత్రి 8.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్కు చేరుకోనున్నది. ఆయా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి. అలాగే 3న తిరుపతి – కాచిగూడ ప్రత్యేక రైలు (02763) సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువ జామున 05.20 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
రైలు రేణిగుంట, శ్రీ కాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, మల్కాజిగిరి స్టేషన్లలో ఆగుతుంది. ఈ నెల 4న కాచిగూడ-తిరుపతి (రైలు నంబర్ 07483).. కాచిగూడ నుంచి రాత్రి 7.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతికి చేరుకోనున్నది. 5న రైలు (07484) తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు కాచికూడ చేరుతుంది. ఈ రైలు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.