హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్-కుర్దారోడ్ మధ్య ఈ నెల 10 నుంచి 12 వరకు నాలుగు వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవరం తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తాయన్నారు. అలాగే సికింద్రాబాద్-నరసాపూర్ స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించారు.