Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడతో పాటు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కాచిగూడ – మధురై (07191) ప్రత్యేక రైలును ఈ నెల 8 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండనున్నది. మధురై-కాచిగూడ (07191) రైలు ఈ నెల 10 నుంచి జూన్ 26 వరకు పొడిగించింది.
కాచిగూడ -నాగర్కోయిల్ (07435) ఈ నెల 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి బుధవారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాగర్కోయిల్ -కాచిగూడ (07436) రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం పరుగులు తీయనున్నది. హెచ్ఎస్ నాందేడ్ – ఈరోడ్ (07189) ఏప్రిల్ 8 నుంచి జూన్ 28 వరకు, ఈ రోడ్ – నాందేడ్ (07190) రైలు ఈ నెల 7 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. జాల్నా – చాప్రా (07651) రైలు జూన్ 26 వరకు, చాప్రా – జాల్నా(07652) ప్రత్యేక రైలు ఈ నెల 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.