హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడుకు బీజేపీ ముఖం చాటేసిం ది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు సభను రద్దుచేసుకోవడం వెనుక భారీ అంతర్మథనమే ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కు బీజేపీ చేసిన కుట్ర బట్టబయలు కావడంతో తెలంగాణ ప్రజలు తమకు ఈసడించుకొనే అవకాశం ఉన్నదని ఢిల్లీ బీజేపీ నిర్ధారణకు వచ్చి నడ్డా పర్యటనను రద్దుచేసుకోవాలని సూచించినట్టు సమాచారం. ఈ నెల 31న మునుగోడులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు నడ్డా హాజరవుతారని బీజేపీ తొలుత ప్రకటించింది. అందుకు ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు బీజేపీ తెరదీస్తూనే ఏమీ ఎరుగనట్టుగా సభ నిర్వహిస్తారా?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? అని జేపీ నడ్డా హాజరైన సభలో ప్రజలు ప్రశ్నిస్తే, అది జాతీయస్థాయిలో దుమారం రేగే అవకాశం ఉన్నదని, గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ చర్య ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేసిన ఉదంతతోపాటు ఎమ్మెల్యేల చేరికల విషయంలో రాష్ట్ర పార్టీతో కనీస సంప్రదింపులు చేయకుండా వారిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ అధినాయకత్వం వ్యవహరించిందని విడుదల అయిన ఆడియోల్లో జరిగిన సంభాషణలు తేటతెల్లం చేశాయి. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకున్నా ఫర్వాలేదు కానీ కనీసం తమను మనుషులుగా కూడా పరిగణనించని తీరుకు రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ఢిల్లీ బీజేపీ గుర్తించినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే నడ్డా తన పర్యటనను రద్దు చేసుకున్నారని ప్రచారం.
మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు కావటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వాదనను స్వయంగా ఆ పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారట. రాజగోపాల్రెడ్డిని, బీజేపీని ప్రజలు ఇప్పటికే ఛీత్కరిస్తుంటే మావోడి (బండి సంజయ్)కి ఏం చెప్పాలో..ఏం చేయాలో తెలువక పిచ్చివాగుడు వాగుతున్నాడని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. ‘అమిత్షా సభకు జనం వస్తుంటే 5 కిలోమీటర్ల దూరంలో జనాన్ని ఆపేశారు. రాజగోపాల్రెడ్డి నామినేషన్ దాఖలు సమయంలో జనం పెద్ద ఎత్తున తరలివస్తుంటే వారి వాహనాలను ఎక్కడిక్కడ నిలిపేశారు. అందుకే నడ్డా సభను రద్దు చేశాం’ అన్న బండి వ్యాఖ్యలపై ‘బుర్ర ఉన్నోడు..ఎవడైనా’ ఇట్లా చెబుతారా?’ అని ఆక్షేపించారు. నడ్డా సభకే దిక్కులేదంటే ఈ మొనగాడు 9 బహిరంగ సభలు నిర్వహిస్తాడట అని ఆ నేత సంజయ్పై ఆగ్రహంతో ఊగిపోయారు. టీఆర్ఎస్ పార్టీగా, ప్రభుత్వంగా బీజేపీని అడ్డుకోదలిస్తే తాము ఇన్ని సభలు పెట్టేవాళ్లమా? అంతెందుకు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగేదా? అనే సోయిలేకుండా మావోడు (బండి సంజయ్) మాట్లాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర నాయకులు మండిపడుతున్నారు.