హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ రానున్నది. త్వరలో ప్రారంభం కానున్న ఐటీ టవర్లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సొనాటా సాఫ్ట్వేర్’ ముందుకొచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నల్లగొండ ఐటీ టవర్లో సుమారు 200 ఉద్యోగాలను సొనాటా సాఫ్ట్వేర్ కల్పించనున్నది. బుధవారం అమెరికాలోని బోస్టన్ నగరంలో మంత్రి కేటీఆర్తో సొనాటా సాఫ్ట్వేర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీని వీరవెల్లి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
బ్యాం కింగ్, ఫైనాన్షియల్ సెక్టార్, ఆరోగ్య రంగం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ల కోసం సొనాటా కార్యకలాపాలు నిర్వహించనున్నది. ఇకడ కార్యకలాపాలు ప్రారంభించనున్న కంపెనీ, స్థానిక యువతకు టెక్నాలజీ రంగంలో నైపుణ్య శిక్షణను కూడా కల్పించనున్నది. మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి, విష్ణువర్ధన్రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఉన్నారు.