Hanumakonda | కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ అత్తను కాల్చి చంపాడు. గుండ్లసింగారంలో జరిగిన ఘటన.. హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా.. నిందితుడిని ప్రసాద్గా గుర్తించారు. ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రసాద్ భార్యతో కలిసి గుండ్ల సింగారం గ్రామానికి వచ్చాడు.
డబ్బుల విషయంలో మరోసారి మాటామాట పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ గన్తో కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృత్యువాతపడింది. కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్ ప్రసాద్ తలకు తీవ్ర గాయాలకు కాగా.. ఆసుప్రతికి తరలించారు. వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.