హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీచర్ల విభజన, కేటాయింపుల్లో తలెత్తుతు న్న సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. సోమవారం సం ఘాల నేతలు జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో విడివిడిగా సమావేశమై వినతిపత్రాలు సమర్పించారు. సమస్యల పై అధికారులతో చర్చిస్తామని మంత్రి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. పీఆర్టీయూ-టీఎస్ తరఫున ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సంఘం రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పీఆర్టీయూ-తెలంగాణ నుంచి అంజిరెడ్డి, చెన్నయ్య, టీఎస్జీహెచ్ఎం ప్రతినిధులు రాజభాను చంద్రప్రకాశ్ మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.
సూచించిన అంశాలివే..