సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఈనెల 24న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజును పురసరించుకుని చేపడుతున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రతిభావంతులైన నలుగురు విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్టాప్లను అందజేశారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..
విద్యార్థుల ఉన్నత చదువులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, దానికి ల్యాప్టాప్లు దోహదపడతాయని ఆకాంక్షించారు. కాగా కేటీఆర్ పిలుపుతో ప్రారంభమైన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు పలు సందర్భాల్లో సుమారు 40 మంది ప్రతిభావంతులైన, పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లను పాటిమీది జగన్మోహన్రావు సమకూర్చారు. సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న యువ నాయకులను కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.