సంగారెడ్డి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): పుణే నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.21 లక్షల విలువైన 120 మిల్లీల ఎండీఎంఏ క్రిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్కు చెందిన హర్జత్ సింగ్(35) హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. డ్రగ్స్కు బానిసై జీతమంతా డ్రగ్స్కు ఖర్చు కావటంతో అదనపు అదాయం కోసం డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. తొలుత సహచరులకు, ఆ తర్వాత ఇతరులకు అమ్ముతూ వస్తున్నాడు. సోమవారం పుణే నుంచి హైదరాబాద్కు కారులో డ్రగ్స్తో వస్తుండగా ఎక్సైజ్ అధికారులు మల్కాపూర్ ైఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీల్లో గుర్తించి సీజ్ చేశారు. హర్జత్సింగ్ను అరెస్టు చేసినట్టు ఎక్సైజ్శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రావు తెలిపారు.