రాష్ట్రంలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య జాతీయ సగటు తక్కువగా ఉన్నదని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. 2019-20లో బాలికలు 10.7 శాతం, బాలురు 14 శాతం మంది బడి మానేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బాలికలు 16.9 శాతం, బాలురు 17.2 శాతం మంది మధ్యలోనే చదువులను మానేసినట్టు పేర్కొంది. కరోనా కారణంగా చేపట్టిన డిజిటల్ క్లాసులను 85 శాతం మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా 11.3 లక్షల మంది, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా 2.2 లక్షల మంది పాఠాలు విన్నారని పేర్కొంది.