హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో బడుగులకు పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే నని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కొనియాడారు. చరి త్రలోనే అత్యంత వెనకబడిన కులాలను గుర్తించి ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేష న్ ఏర్పాటుతోపాటు బడుగులకు సంక్షేమ పథకాలను, కార్పొరేషన్ పదవులను కట్టబెట్టిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గా బలహీన వర్గాలకు చెందిన కుర్రా సత్యానారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సీఎం కేసీఆర్, రాష్ట్ర క్యాబినెట్ ప్రతిపాదించడంపై ఆనందం వ్యక్తం చేశారు. బడు గులకు గొప్ప అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ బుధ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే బడుగులకు రా జ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అవ కాశాలు దక్కుతుండటంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.