Chennai Train | గద్వాల రైల్వేస్టేషన్లో చెన్నై ఎగ్మోర్ రైలును అధికారులు నిలిపివేశారు. అకస్మాత్తుగా రైలు ఎక్స్ప్రెస్ బోగీలో నుంచి దట్టంగా పొగలు వ్యాపించాయి. దాంతో అధికారులు వెంటనే రైలును ఆపి.. ప్రయాణికులను దింపివేశారు. కాచిగూడ నుంచి చెన్నైకి బయలుదేరిన రైలులో మంటలు చెలరేగాయి. ఎక్స్ప్రెస్ రైలులోని ఎనిమిదో నెంబర్ ఏసీ బోగిలో పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు. ఆ తర్వాత అధికారులు ప్రయాణికులను బోగీల నుంచి ప్రయాణికులను దింపారు. అసలు రైలులో పొగలు రావడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.