జగిత్యాల : కాళేశ్వరం లింకు – 2 పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు రవి, కర్ణన్ లతో కలిసి పరిశీలించారు. మొదట కాలేశ్వరం లింకు టు పనులు మొదలయ్యే స్థలం కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో బొట్లో తిరుగుతూ పరిశీలించారు.
అనంతరం నాలుగు కిలోమీటర్ల దూరం లో జరుగుతున్న టన్నెల్ వర్క్, బ్రిడ్జి పనుల వద్ద కలియ జరుగుతున్న పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అడిషనల్ కలెక్టర్లు మాధురి, గర్మి అగర్వాల్, ఎస్ఈ నూనె శ్రీధర్, మేఘ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.