హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : డిగ్రీలో అప్రెంటిస్షిప్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు విద్యాశాఖ ముందడుగు వేసింది. విద్యార్థులు చదువుతూనే నెల వారీ గా ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కుకొనేలా ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు వేగవంతం చేసింది. తొలుత డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకే సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు భా వించారు. అయితే, తాజాగా ద్వితీయ, తృతీ య సంవత్సర విద్యార్థులకు కూడా ఇలాంటి కోర్సులనే తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టడం, నిర్వహించడంపై రోడ్మ్యాప్ను రూపొందించేందుకు శుక్రవారం హైదరాబాద్ తార్నాకలోని పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి, సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్(సీఆర్ఐఎస్పీ)ల సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహించాయి.
ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబా ద్రి, రిటైర్డ్ ఐఏఎస్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మా జీ ప్రధాన ఆర్థిక సలహాదారు వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు,పలు వర్సిటీల వీసీలు ప్రొ ఫెసర్ డీ రవీందర్, ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ విజ్జులత, పలు కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైలర్స్ అసోసియేషన్ సీఈవో జే మ్స్ రాఫెల్, పలు సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సీ ఈవోలు అభిలాష, రవికాంత్, ప్రవీణ్ సక్సే నా, తమిముద్దీన్ సిద్దిఖీ, ఆశిష్ జైన్, ఈశ్వర్పూజార్, అమిత్సింగ్ పలు సెక్టార్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. కాగా, రాష్ట్రంలోని 7 వర్సిటీల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. మే 1న మరోసారి చర్చించి కోర్సులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.