కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు (Manakonduru)మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చెంజర్ల వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్లోని ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంతా భూపాలపల్లికి చెందినవారిగా గుర్తించారు. వేములవాడ, కొండగట్టు దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.