రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. సిగరేట్లను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారివద్ద 22,600 సిగరెట్లతో పాటు 940 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.66 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.