సంగారెడ్డి : జిల్లాలోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామ శివారులో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలిలో టైటాన్ వాహనాల కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, అధికారులు పరిశీలించారు.
బుధవారం ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ ఎల్గోయి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న భారీ వాహనాల తయారీ పరిశ్రమ కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో టైటాన్ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.