హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలో నిర్వహిస్తున్న జాతీయ మహాసభల చివరి రోజు ఆదివారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. సీపీఎంను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్తానని స్పష్టంచేశారు. కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.