నాంపల్లి కోర్టులు, మే 5 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అన్నదమ్ములు కోస్గి రవికుమార్ (ఏ21), కోస్గి భగవంత్కుమార్ (ఏ22)ను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
ప్రధాన నిందితులు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ద్వారా వీరు ఏఈ ప్రశ్నపత్రం కొన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, కీలక సమాచారం, ఇంకెవ్వరితో అయినా సంబంధాలు కొనసాగాయా అనే విషయాలను తెలుసుకొనేందుకు కస్టడీకి అప్పగించాలని సిట్ పీపీ కృష్ణయ్య కోర్టును కోరారు.