హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, పొగమంచు ఏర్పడనున్నదని పేర్కొన్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్,ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్(యూ)లో అత్యల్పంగా 11.5 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది.