హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం ఉదయం సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిరివెన్నెల పార్థివదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తరపును అందించే సాయం గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించినట్లు సిరివెన్నెల కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సిరివెన్నెల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.