హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ. 698.25 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.811.48 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 86.04 శాతం వసూలైంది.
సిరిసిల్లలో 99.17 శాతం వసూలు
రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీ అగ్రభాగాన నిలిచింది. అత్యధికంగా 99.17 శాతం (రూ.4.39 కోట్లు) పన్ను వసూలు చేసింది. అలాగే, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.52.76 కోట్ల పన్ను వసూలైంది.
రాయితీని వినియోగించుకోవాలి
పట్టణాల్లో ఈ నెలాఖరు వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందని సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అందరూ పన్ను చెల్లించి రాయితీని వినియోగించుకోవాలని ఆయన కోరారు.