సిరిసిల్ల టౌన్, మార్చి 26 : సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గురువారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, జీ 20లోగో నేసి ప్రధాని ప్రశంసలు పొందిన హరిప్రసాద్ను గవర్నర్ సత్కరించి, అభినందించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, వెదురుతో చేసిన సిరిసిల్ల మరమగ్గం జ్ఞాపికను గవర్నర్కు అందజేసినట్టు పేర్కొన్నారు. త్వరలోనే సిరిసిల్లను సందర్శించి ఇక్కడి కార్మికుల స్థితిగతులను తెలుసుకుంటానని గవర్నర్ చెప్పినట్టు పేర్కొన్నారు.