మంచిర్యాల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి కార్మిక సంఘాలతో హైదరాబాద్ సోమవారం డిప్యూటీ లేబర్ కమిషనర్ సమావేశమయ్యారని, ఇందులో సింగరేణి ఎన్నికలకు సంబంధించి తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలు పట్టుబట్టాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.
ఈ నెల 21న సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లిస్తున్నందున 22వ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని మిగిలిన కార్మిక సంఘాలన్నీ కోరాయని పేర్కొన్నారు. మెజార్టీ కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈ నెల 22న షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారని, అక్టోబర్ నెలాఖరు లేదా అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ఒక ప్రకటన విడుదల చేశారు.