హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో ఒకటైన సింగపూర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) రాష్ట్రంలోని వర్సిటీలతో జట్టుకట్టనున్నది. ఇంజినీరింగ్, ఆర్ట్స్, ఫైన్, లిబరల్ ఆర్ట్స్ వంటి రంగాల్లో పలు వర్సిటీలతో భాగస్వా మ్యం కానున్నది. బాసర ఆర్జీయూకేటీతో పాటు ఫైన్ఆర్ట్స్ వర్సిటీ, ఉస్మానియా వర్సిటీలతోను ఒప్పందాలు చేసుకోనున్నది. ఈ మేరకు ఎన్టీయూ ప్రతినిధి బృందం జూలైలో రాష్ర్టానికి రానున్నది.
ఇం దులోభాగంగా సోమవారం ఎన్టీయూ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎమరిటస్ మెటీరియల్స్ రిసెర్చ్ సొసైటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి రాష్ట్రంలో పర్యటించారు. సచివాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్చైర్మన్ వెంకటరమణ, ఓయూ వీసీ డీ రవీందర్ ఈ భేటీలో పాల్గొన్నారు.