హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సింగపూర్ పెట్టుబడులకో సం ప్రత్యేక జోన్ లేదా, సింగపూర్ హబ్ను ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపా రు. మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో భారతదేశంలో సింగపూర్ హైకమిషనర్ సిమోన్ వాంగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో అనుకూలతలను మంత్రి వివరించారు. హై దరాబాద్ వందల ఏండ్లుగా దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మొపాలిటన్ స్వభావం తో అభివృద్ధి చెందుతూ వస్తున్నదని, ఇక్కడ అనేక రాష్ర్టాలతోపాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు, వారి సిబ్బంది దీర్ఘకాలంగా పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ఐపాస్, సింగిల్ విండో అనుమతులతో అ నేక అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చాయని వి వరించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టై ల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ తదితర రంగా ల్లో పెట్టుబడికి మంచి అవకాశాలున్నాయని పే ర్కొన్నారు. సింగపూర్కు చెందిన పలు కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయ ని, తమ కార్యకలాపాల పట్ల సంతృప్తిగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
సింగపూర్ హైకమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను సింగపూర్ కంపెనీలు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో తమవంతు సహకారమందిస్తామని చెప్పారు. నూతన రంగాల్లో పెట్టుబడులకు చాలా అవకాశాలున్నాయని ఇక్కడ పెట్టుబడులు పెట్టిన డీబీఎస్ కంపెనీలు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు ఇక్కడి సానుకూలతలపై ఇప్పటికే తనకు సమాచారం అందించినట్లు చెప్పారు. సింగపూర్ కంపెనీలు ఐటీ, ఇన్నోవేషన్, ఐటీ అనుబంధ రంగాల్లోని బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
హైదరాబాద్లో ఉన్న టీ-హబ్ వంటి వాటి ద్వారా ఇక్కడున్న ఐటీ ఇకోసిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించిన సానుకూలతల గురించి తాను తెలుసుకున్నట్లు చెప్పారు. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడి అవకాశాలపట్ల సానుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. సింగపూర్ పెట్టుబడులకోసం ప్రత్యేక జోన్, లేక సింగపూర్ హబ్ ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి కేటీఆర్ ప్రతిపాదించడం గొప్ప ఆలోచన అని హైకమిషనర్ పేర్కొన్నారు. తాను వియత్నాంలో పనిచేసినప్పుడు ఇలాంటి ప్రయత్నంచేశానని, దాంతో అక్కడ అనేక పెట్టుబడులు వచ్చాయని, అవి విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన మంత్రి కేటీఆర్కు హామీ ఇచ్చారు. సమావేశానంతరం మంత్రి కేటీఆర్, సిమోన్ వాంగ్తోపాటు చెన్నైలో సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్ కాక్టియన్ తదితరులను కేటీఆర్ శాలువాలతో సత్కరించారు.
మంత్రి కేటీఆర్తో భేటీ అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో సిమోన్ వాంగ్ తన ప్రతినిధిబృందంతో భేటీ అయ్యారు.