హాజరైన మాజీ మంత్రి హరీశ్రావు
కొండాపూర్, జనవరి 21: లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ.. బాల గాంధ ర్వం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఘనం గా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చినజీయర్స్వామి, శోభారాజు, వరప్రసాదరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిచయం అక్కర్లేని గొప్ప సంగీత గురువు లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కొమాండూరి రామాచారి అని కొనియాడారు. మట్టిలోని మాణిక్యాలను సింగర్లుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నదంటూ అకాడమీని ప్రశంసించారు. చదువు భారంతో విసిగిపోతున్న బాల్యానికి రామాచారి సంగీతం అనే ఉల్లాసాన్ని, వికాసాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇండియన్ ఐడల్ లాంటి షోలలో ఆయన శిష్యులు విజేతలుగా నిలవడం గర్వకారణమన్నారు. ఎంతోమంది పిల్లలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్న రామాచారి సంస్థకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు హరీశ్రావు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, సింగర్లు పాల్గొని సందడి చేశారు.