Karimnagar | కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం( Timmapur ) గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు( NAREGA Workers ).. ఇదే గ్రామంలోని పాత ఊరు వద్ద ఫిష్ పాండ్( Fish Pond ) కోసం గుంత తవ్వుతుండగా 27 వెండి నాణేలు( Silver Coins ) దొరికిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండు రోజుల కిందనే ఇవి లభ్యమైనట్లు తెలుస్తుండగా కూలీలు తలా కొన్ని పంచుకొని తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు శుక్రవారం గ్రామానికి వెళ్లి కూలీలు తీసుకెళ్లిన నాణేలను స్వాధీనం చేసుకుని పంచనామా చేశారు. ఒక్కో నాణెం తులం బరువు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. అయితే గతంలో కూడా ఈ ప్రాంతాల్లో వ్యవసాయం కోసం భూమి చదును చేస్తుండగా పలువురికి ఇలాంటి నాణేలు దొరికాయని స్థానికులు చెబుతున్నారు.