హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదరం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటవరకు కొనసాగనుంది. హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో 503 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 554 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ప్రతి పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.20 మార్కు కోత విధిస్తారు.