సూర్యాపేట సిటీ, నవంబర్ 15: ఎస్సై కావాలనే ఆకాంక్షతో ఫిజికల్ టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మం గళవారం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు.
అనంతరం నిర్వహించే దేహదారుఢ్య పరీక్షల కోసం సూర్యాపేటలోని వేంకటేశ్వర డిగ్రీ కాలేజీలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం రన్నింగ్ చేస్తుండగా కుప్పకూలాడు. మిత్రు లు వెంటనే సూర్యాపేట జిల్లా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.