ములుగు, మే 23 (నమస్తే తెలంగాణ): డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్న దళితుడిని ఎస్సై స్టేషన్కు పిలిపించి బూటుకాలితో తన్ని తెల్లకాగితంపై సం తకం చేయించిన ఘటన గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు బోడ రామకృష్ణ కథనం ప్రకారం.. మంగపేట మండలానికి చెందిన బోడ రామకృష్ణ ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం (నూగూరు) మండలాలకు కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతనితోపాటు దాస రాజ్కుమార్, పాపని రాజేశ్ కూడా పనిచేస్తున్నారు. రాజ్కుమార్.. రాజేశ్ వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో బోడ రామకృష్ణ మధ్యవర్తిగా ఉన్నాడు.
రాజ్కుమార్ డబ్బు ఇవ్వకపోవడంతో రాజేశ్ ఏటూరునాగారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రామకృష్ణను ఎస్సై స్టేషన్కు పిలువగా ఆయన తనతండ్రితోపాటు భార్యను తీసుకెళ్లాడు. రామకృష్ణ ఒక్కడినే లోపలికి పిలిచిన ఎస్సై.. డబ్బు గురించి అడుగుతూ కులం పేరుతో దూషించి గొంతు పట్టుకొని బూటుకాలితో తన్నినట్టు బాధితుడు రా మకృష్ణ తెలిపాడు. డబ్బు ఎలాగైనా ఇప్పిస్తానని చెప్పినా వదలలేదని వాపోయాడు. బలవంతంగా తెల్లకాగితంపై సంతకం పె ట్టించుకున్నాడని తెలిపాడు. అకారణంగా తనను కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవా లని బాధితుడు రామకృష్ణ వీడియోను వి డుదల చేశాడు. తాను కులం పేరుతో దూ షించి కొట్టలేదని, కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నాడని ఎస్ఐ పేర్కొన్నారు.