సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 9: కొలీజియం సిఫారసు చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించకపోవడంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. జడ్జిల పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నా కేంద్రం ఏమీ పట్టనట్టు ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టుల్లో జడ్జిలు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల ముఖ్యమైన అంశాలపైన కూడా విచారణ ఆలస్యం అవుతున్నదని ఆందోళన చెందింది. దీనిపై ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరింది.