హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): గీత కార్మికులకు తాటిచెట్టు ఎకే యంత్రాలు, బైకులను రాయితీపై అందించాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్ నేతృత్వంలో పలువురు నేతలు గురువారం బీఆర్కే భవన్లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టాడీ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరస్వామిగౌడ్ మాట్లాడుతూ.. గీతవృత్తిదారుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు విశేష కృషి చేస్తున్నదని చెప్పారు. చెట్టుపై నుంచి పడిన గీతకార్మికులకు ఎక్స్గ్రేషియా, తాటి ఉత్పత్తుల మీద పరిశోధనలు తదితర అంశాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్గౌడ్, గౌడ సంఘాల జేఏసీ నాయకులు పల్లె రవిగౌడ్, రేగటి నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.