హైదరాబాద్ : 2022 సంవత్సరానికి గాను శేఖర్ స్మారక అవార్డును హిందూ కార్టూనిస్ట్ సురేంద్ర అందుకున్నారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సురేంద్రకు అవార్డు, ప్రశంసాపత్రం, రూ.10వేల నగదును బహూకరించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ పొలిటికల్ కార్టూన్ అనగానే శేఖర్ గుర్తుకు వస్తారని, ఆయన కార్టూన్లకు అంత శక్తి ఉందన్నారు. కార్టూనిస్టుగా మాత్రమే కాకుండా ఒక ఆర్గనైజర్గా యాక్టివిస్టుగా, రచయితగా శేఖర్ బహుముఖ పాత్ర పోషించారని కొనియాడారు.
శేఖర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డు తనకు ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డు కంటే గొప్పదని వ్యాఖ్యానించారు. సీనియర్ కార్టూనిస్టులు శంకర్, నర్సింహం, మృత్యుంజయ్, నారు, రాకేష్, అవినాష్, జేవీ తదితరులు శేఖర్తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శేఖర్ కుటుంబ సభ్యుల తరఫున ఆయన కుమారుడు కార్టూనిస్ట్ సురేంద్రకు సన్మానం చేసి అవార్డును బహూకరించారు. పాత్రికేయులు క్రిష్ణ, ఆసరి రాజు, సాయి, శివ, మహేందర్ పాల్గొన్నారు.