కొత్తగూడెం: దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజైన బుధవారం అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వేడుకలలో భాగంగా వేదపండితులు లక్ష్మితాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. రాత్రి 8 గంటలకు సీతారామలక్ష్మణ మూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఈనెల 15న విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు జరుగనున్నాయి.